Bollywood: 17 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న అమితాబ్, షారుఖ్

Bollywood: 17 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకోనున్న అమితాబ్, షారుఖ్
బాలీవుడ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. అమితాబ్, షారుఖ్ ఒకే స్ర్కీన్ పై..

బాలీవుడ్ అనగానే చాలా మంది మనసుల్లో ముందుగా మెదిలే పేర్లు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్. ఈ ఇద్దరు సూపర్‌స్టార్లు అప్పట్లో బాలీవుడ్‌ను పాలించారు. వీరిద్దరూ మరోసారి కలిసి స్క్రీన్‌ను పంచుకోవడం కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. షారూఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ 17 సంవత్సరాల తర్వాత తెరపై మళ్లీ ఒక్కటవ్వడానికి సిద్ధంగా ఉన్నందున ఆ సందర్భం కోసం ప్రేక్షక జనం తీవ్రంగా ఎదురుచూస్తోంది. బిగ్ బి, షారూఖ్ చివరిసారిగా కరణ్ జోహార్ దర్శకత్వం వహించిన 2006 చిత్రం 'కభీ అల్విదా నా కెహనా'లో కలిసి కనిపించారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, రాణి ముఖర్జీ, ప్రీతి జింటా కూడా నటించారు.


మళ్లీ 17 ఏళ్ల తర్వాత..

అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ మరోసారి కలిసి స్క్రీన్‌ను పంచుకునే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ త్వరలోనే వెల్లడి కానుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా పెద్దగా తెలియనప్పటికీ, దీనికి సంబంధించిన వార్తలు త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి ఇది అతి పెద్ద వార్త అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరూ గతంలో 'మొహబ్బతేన్', 'కభీ ఖుషీ కభీ ఘమ్', 'కభీ అల్విదా నా కెహనా' వంటి దిగ్గజ చిత్రాలలో స్క్రీన్‌ను పంచుకున్నారు.

బిగ్ బి, షారూఖ్ తిరిగి కలుస్తున్నారనే వార్తలు వచ్చిన వెంటనే, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో కొన్ని రోజుల క్రితం ప్రకటించిన 'డాన్ 3' లో వారు అతిథి పాత్రలో నటిస్తారా అని అభిమానులు ఊహాగానాలు చేయడ ప్రారంభించారు. డాన్ ఫ్రాంచైజీకి గతంలో అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ నాయకత్వం వహించారు. ఇక అమితాబ్ బచ్చన్.. 'కల్కి 2898', 'ది ఉమేష్ క్రానికల్స్', 'గణపత్' చిత్రాలలో కనిపించనున్నారు. కాగా, షారుక్ ఖాన్ 'జవాన్' విడుదలకు సిద్ధమవుతున్నాడు. అతను ప్రస్తుతం 'డుంకీ' కూడా చేస్తున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story