అమీషా పటేల్ కు బెయిల్ మంజూరు

అమీషా పటేల్ కు బెయిల్ మంజూరు
జార్ఖండ్ కు చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ మోసం, చెక్కు బౌన్స్ కేసును దాఖలు చేశారు


బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ కు బెయిల్ మంజూరైంది. 2018లో చెక్ బౌన్స్ కేసు నమోదైంది. కాగా శనివారం జూన్ 17న అమీషా పటేల్ రాంజీ సివిల్ కోర్టులో లొంగిపోయింది. దీంతో సీనియర్ డివిజన్ న్యాయమూర్తి DN శుక్లా బెయిల్ మంజూరు చేశారు. జూన్ 21న మరోసారి కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి చెప్పారు. చెక్ బౌన్స్ కేసు గురించి నటి అమీషా పటేల్ తొలిసారిగా మాట్లాడారు. ఇది ఒక తప్పుడు ఫిర్యాదు అని కావాలనే తనను కేసులోకి లాగారని అన్నారు. కాగా.. జార్ఖండ్ కు చెందిన సినీ నిర్మాత అజయ్ కుమార్ సింగ్ మోసం, చెక్కు బౌన్స్ కేసును దాఖలు చేశారు.

కేసు నిమిత్తం కోర్టుకు హాజరైన అమీషాతో ఫొటోలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. మీడియాతో మాట్లాడిన అమీషా.. తాను చట్టాన్ని గౌరవిస్తానని తెలిపారు. "నా మౌనాన్ని, చట్టం, వ్యవస్థ పట్ల ఉన్న గౌరవాన్ని అజయ్ దుర్వినియోగం చేస్తున్నాడు. నాపై కేసు వేసి తాను అందరి దృష్టిలో పడాలనుకుంటున్నాడు. చట్టం తప్పక నాకు న్యాయం చేస్తుంది" అని అన్నారు. అమీషా పటేల్ ప్రస్తుతం గదార్ 2 లో నటిస్తోంది. ఒకప్పుడు బాలీవుడ్ తో పాటు తెలుగులో ఒక వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్ హీరోగా అమీషా పటేల్ నటించిన బద్రి సినిమా ఏ విధంగాహిట్ అయిందో అందరికీ తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story