మనవడి పెళ్లిలో మొదటి భార్యతో ధర్మేంద్ర

మనవడి పెళ్లిలో మొదటి భార్యతో ధర్మేంద్ర
పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి

మనవడి వివాహానికి మొదటి భార్యతో కలిసి హజరయ్యారు అలనాటి బాలీవుడ్ హీరో ధర్మేంద్ర. జూన్ 18, 2023న కరణ్ డియోల్. ద్రిషా ఆచర్యకు వివాహం జరిగింది. ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్ లో జరిగిన వివాహ వేడుకకు ధర్మేంద్రతో పాటు ఆయన మొదటి భార్య ప్రకాష్ కౌర్ హాజరవడం చర్చనీయాంశం అయింది. ధర్మేంద్ర హెమామాలినిని పెళ్లిచేసుకోక ముందు ప్రకాష్ కౌర్ ను వివాహమాడారు. 1954లో వీరికి వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు కుమారులు... వారే సన్నీ డియోల్, బాబీ డియోల్. కాలాంతరంలో హెమామాలినితో ప్రేమ బంధాన్ని నడిపిన ధర్మేంద్ర 1979లో హెమామాలినిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. వారే ఈషా డియోల్, అహానా డియోల్.

కరణ్ డియోల్, ద్రిషాల వివాహం జూన్ 18న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ లో జరిగింది. స్నేహితులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మొదటి ఫొటోలో ధర్మేంద్ర తన మొదటి భార్య ప్రకాష్ కౌర్ తో కలిసి మనవడిని ఆశీర్వదిస్తున్నారు. రెండో ఫొటోలో సన్నీ డియోల్, పూజా డియోల్ కూడా కొత్త జంటతో కలిసి కెమెరాకు ఫోజులిచ్చారు.


కరణ్ డియోల్ సన్నీ డియోల్ యొక్క కుమారుడు. ధర్మేంద్ర మనవడు. 2019లో 'పల్ పల్ దిల్ కే పాస్' తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమాకు సన్నీడియోల్ రచన, దర్శకత్వం వహించారు. సన్నీ సౌండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆ తర్వాత ఆప్నే 2 లో కరణ్ నటించారు. ఇందులో తాత ధర్మేంద్ర, బాబాయ్ బాబీ డియోల్ నటించారు. తన పెళ్లి ఫోటోలను షేర్ చేసిన కరణ్... అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. "మా కుటుంబానికి ఆశీర్వాదాలు, మద్దతును తెలియజేస్తున్న అందరికీ కృతజ్ఞతలు. " అని ట్వీట్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story