Guntur Kaaram OTT Release Date: ఓటీటీలోకి మహేష్ మసాలా మూవీ
'గుంటూరు కారం' చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నాగ వంశీ నిర్మించారు. ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు. 'గుంటూరు కారం' ఫిబ్రవరి 9, 2024 నుండి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫారమ్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో ప్రసారం చేయబడుతుంది. మహేష్ బాబుతో పాటు, గుంటూరు కారంలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, రావు రమేష్, జగపతి బాబు, అజయ్ ఘోష్ లాంటి అనేక మంది భారీ తారాగణం నటించారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ రచన, దర్శకత్వం వహించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై నాగ వంశీ నిర్మించారు, ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఇందులో ఈ చిత్రం ఈ ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ కి రాబోతున్నట్టుగా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ అఫీషియల్ అప్డేట్ అందించింది. అలాగే ఒరిజినల్ తెలుగు సహా తమిళ, మళయాళం, కన్నడ అలాగే హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి వస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే ఓటీటీలో రమణ గాడి ర్యాంపేజ్ కి డేట్ ఫిక్స్ అయ్యిందనే చెప్పాలి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com