K Raghavendra Rao : దేవతకి 40 ఏళ్లు.. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ఎమోషనల్ పోస్ట్

K Raghavendra Rao : దేవతకి 40 ఏళ్లు.. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ఎమోషనల్ పోస్ట్
K Raghavendra Rao : ఈ సినిమా 1982 సెప్టెంబర్ 10న రిలీజ్ అయింది. ఇవాళ్టితో సరిగ్గా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది

K Raghavendra Rao : దర్శకుడు కె రాఘవేంద్రరావు సోషల్ మీడియాతో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన దర్శకత్వంలో శోభన్‌బాబు, శ్రీదేవి, జయప్రద హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా దేవత. ఈ సినిమా 1982 సెప్టెంబర్ 10న రిలీజ్ అయింది. ఇవాళ్టితో సరిగ్గా 40 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు.. 'దేవత కి 40 ఏళ్ళు … అఖండ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్ళకి నా అభినందనలు.' అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ కాలంలోనే ఈ సినిమా పెద్ద హిట్‌తో పాటు సుమారు 1.7 కోట్ల రూపాయల బాక్సాఫీస్ కలెక్షన్స్ చేసింది. ఇందులోని 'ఎల్లువొచ్చి గోదారమ్మ వెల్లకిల్లా పడ్డాదమ్మో.. ఎన్నెలొచ్చి రెల్లుపూలై వెండి గిన్నెలయ్యేనమ్మో..' పాట ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్ సాంగ్స్‌లో ఒకటి.

Tags

Read MoreRead Less
Next Story