Keerthy Suresh: కీర్తి డెబ్యూ మూవీ 'నేను శైలజా' కాదు.. ముందుగా అలనాటి నటి మనవడితో..

Keerthy Suresh: కీర్తి డెబ్యూ మూవీ నేను శైలజా కాదు.. ముందుగా అలనాటి నటి మనవడితో..
Keerthy Suresh: ఒకప్పటి హీరోయిన్లలో సావిత్రి, సౌందర్య అంటే ప్రేక్షకులకు అభిమానం, ఇష్టం మాత్రమే కాదు.. గౌరవం కూడా.

Keerthy Suresh: ఒకప్పటి హీరోయిన్లలో సావిత్రి, సౌందర్య అంటే ప్రేక్షకులకు అభిమానం, ఇష్టం మాత్రమే కాదు.. గౌరవం కూడా. అందుకే ఈకాలంలో ఏ హీరోయిన్ అయినా ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ, ప్రేక్షకులను తమ నటనతో మెప్పిస్తుంటే వారిని సావిత్రి, సౌందర్యతో పోలుస్తారు. అలాంటి హీరోయిన్లలో ఒకరు కీర్తి సురేశ్. అలాంటి కీర్తి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా తన సినీ కెరీర్‌ గురించి కొన్ని విశేషాలు..

కీర్తి సురేశ్ మలయాళీ అమ్మాయి. తన తల్లిదండ్రులు కూడా సినీ పరిశ్రమకు చెందినవారే. అందుకే చిన్నప్పటి నుండే కీర్తికి యాక్టింగ్ అంటే ఇష్టం. ఆ ఇష్టంలో మూడు మలయాళ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కూడా చేసింది. ఆ తర్వాత మాలీవుడ్‌లోనే హీరోయిన్‌గా కూడా అడుగుపెట్టింది. 'ఇదు ఎన్న మాయం' చిత్రంతో తమిళంలో కూడా తన నటనతో ఆకట్టుకుంది.

తెలుగులో రామ్‌తో నటించిన 'నేను శైలజా'తో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది కీర్తి సురేశ్. కానీ అందరూ అనుకుంటున్నట్టుగా తెలుగులో నేను శైలజా.. కీర్తి ఫస్ట్ మూవీ కాదు. అంతకు ముందే తానొక స్టార్ యాక్టర్ తనయుడితో ఒక సినిమా చేసింది. నేను శైలజా కంటే ముందే కీర్తి.. విజయ్ నిర్మల మనవడు, నరేశ్ కొడుకు నవీన్ విజయ్ కృష్ణతో కలిసి 'అయినా ఇష్టం నువ్వు' అనే చిత్రంలో నటించింది. కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆ తర్వాత చాలాకాలానికి 'రెండు జళ్ల సీత'గా టైటిల్ మార్చి విడుదల చేయాలనుకున్నా టైమ్ కలిసి రాలేదు.

నేను శైలజాతో తనకు గ్రాండ్ ఎంట్రీ దొరికింది. ఇక సావిత్రి బయోపిక్ 'మహానటి'లో చేసిన తర్వాత కీర్తికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ప్రస్తుతం తాను మహేశ్ బాబు, చిరంజీవి లాంటి స్టార్లతో నటిస్తూ బిజీ బిజీగా గడిపేస్తోంది. ఇక తన పుట్టినరోజు సందర్భంగా సౌత్ నటీనటులు తమ సోషల్ మీడియాలో తనకు బర్త్‌డే విషెస్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story