RC15లో కియారా అద్వాణీ

RC15లో కియారా అద్వాణీ
Kiara Advani: "భరత్ అనే నేను" సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది "కియార".

Kiara Advani: "భరత్ అనే నేను" సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది "కియార". మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఈ సినిమా విజయంతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్టులో చేరిపోయింది ఈ బ్యూటీ. వరుస అవకాశాలు వచ్చిన తను మాత్రం సెలెక్టివ్ సినిమాలు మాత్రమే ఒప్పుకుంది.

బోయపాటి దర్శకత్వంలో వచ్చిన "వినయ విదేయ రామ" సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది "కియార". ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం కావడంతో అమ్మడుకి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తనకి అచ్చొచ్చిన బాలీవుడ్ లో వరుస సినిమాలు చేసుకుంటూ తెగ బిజీ అయిపాయింది. ఆమధ్య తెలుగులో సూపర్ హిట్ అయిన "అర్జున్ రెడ్డి" హిందీ రీమేక్ లో షాహిద్ కపుర్ తో కలిసి నటించింది కియార. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా సూపర్ హిట్ అయింది.

అయితే ఈ భామకి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వచ్చిందట. రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు ప్రాజెక్ట్ లో "కియారా అద్వాణీ" ని తీసుకున్తున్నట్టు చిత్ర బృందం తెలిపింది. తమ 50వ చిత్రంగా తెరకేక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో మంది హీరోయిన్ ల పేర్లని పరిశీలించినా.. చివరికి "కియారా అద్వాణీ" నే హీరోయిన్ గా తీస్కున్నారట చిత్ర యూనిట్. అయితే పరంగానూ ఆలోచించి కియారాను తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కియారాకు బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఇక తెలుగులోనూ మంచి క్రజ్ ఉంది. రెండు మార్కెట్ లని కవర్ చేయోచ్చని అనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయానికి వచ్చారట.

ఇదిలా ఉండగా ఈరోజు (జూలై 31) కియారా బర్త్ డే సందర్భంగా ఈ అప్డేట్‌ను ఇచ్చారు టీం. ఇక ఇప్పటికే శంకర్‌తో కియారా మాటామంతీ జరిపినట్టు.. స్క్రిప్ట్ గురించి చర్చించినట్టు కనిపిస్తోంది. మొతానికి కియార రాకతో ఈ ప్రాజెక్ట్ ఇంకొంచం హైప్ క్రియేట్ అయిందనే చెప్పాలి.

Tags

Read MoreRead Less
Next Story