ట్రెండింగ్ లో ‘భోళా శంకర్‘ టీజర్

రీఎంట్రీలో సినిమాల దూకుడు పెంచిన మెగాస్టార్ చిరంజీవి.. ‘భోళా శంకర్‘తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఆగస్టులో ఆడియన్స్ ముందుకు రాబోతున్న ‘భోళా శంకర్‘ నుంచి లేటెస్ట్ గా రిలీజైన టీజర్ కి సూపర్ అప్లాజ్ వస్తోంది. ‘స్టేట్ డివైడ్ అయినా అందరూ నావాళ్లే‘ అంటూ డైలాగ్స్ తో.. మెస్మరైజింగ్ మాస్ యాక్షన్ గ్రేస్ తో టీజర్ లో అదరగొట్టాడు మెగాస్టార్. విడుదలైన గంటల్లోనే ట్రెండింగ్ లోకి దూసుకెళ్లిన ‘భోళా శంకర్‘ టీజర్ మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది.

చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దాలు గడిచినా.. మధ్యలో తరాలు మారినా.. మెగాస్టార్ మెస్మరైజింగ్ ఇమేజ్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రీఎంట్రీలో కుర్ర హీరోలకు దీటుగా సినిమాల స్పీడు పెంచిన చిరు.. ‘గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య‘ వంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ‘భోళా శంకర్‘తో హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ సినిమా ‘వేదాళం‘ రీమేక్ గా మెహర్ రమేష్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 11న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. విడుదలకు ఇంకా నెలన్నర మాత్రమే సమయం ఉండడంతో ‘భోళా శంకర్‘ ప్రచారాన్ని షురూ చేసింది టీమ్. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు.

“షికారుకొచ్చిన షేర్‌ను బే” అనే డైలాగ్ మొదలుకొని.. తెలంగాణ యాసలో చిరంజీవి చెప్పిన డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. నడకలో గ్రేస్.. డ్యాన్సుల్లో స్టైల్.. యాక్షన్ లో మెస్మరైజింగ్ మాస్.. టీజర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. అందుకే.. విడుదలైన గంటల్లోనే ఈ టీజర్ 15 మిలియన్ల వ్యూస్ ను క్రాస్ చేసింది.

మెగాస్టార్ కి గతంలో పలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ ‘భోళా శంకర్‘ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ‘యుఫోరియా నా ఏరియా.. భోళా మేనియా‘ అంటూ ఇప్పటికే రిలీజైన ఈ మూవీలోని సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ‘భోళా శంకర్‘ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుంటే.. చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించబోతుంది. ఎ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మొత్తంమీద.. ‘భోళా శంకర్‘తో హ్యాట్రిక్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మరోసారి సత్తా చాటుతాడేమో చూడాలి.


Tags

Read MoreRead Less
Next Story