Puneeth Rajkumar : పునీత్ చివరి సినిమా టీజర్ వచ్చేసింది..!
Puneeth Rajkumar : గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ మరిణించిన సంగతి తెలిసిందే.. ఆయన మరణం ఇండస్ట్రీలోని ప్రముఖులను మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను కలిచివేసింది. ఇప్పటికి పునీత్ ఇక లేరు అన్న నిజాన్ని ఎవ్వరు కూడా నమ్మలేకపోతున్నారు.
ఇక పునీత్ చివరి చిత్రం కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన జేమ్స్ టీజర్ని ఈ రోజు ఉదయం మేకర్స్ రిలీజ్ చేశారు. 'ఎమోషన్స్ అనేవి వ్యాపారం కన్నా పెద్దవి' అన్న డైలాగ్ తో మొదలైన చిత్ర టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. టీజర్ చూస్తుంటే సినిమాలో పునీత్ సెక్యురిటీ ఏజెన్స్ ఆఫీసర్గా నటిస్తున్నట్టుగా తెలుస్తోంది.
చేతన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పునీత్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది. శ్రీకాంత్ విలన్గా నటించాడు. ఈ సినిమాలో పునీత్ పాత్రకి ఆయన అన్నయ్య శివరాజ్కుమార్ కన్నడలో డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాని మార్చి 17న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలున్నాయి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com