Rajinikanth : రజినీకాంత్ అరకోటి విరాళం..!

Rajinikanth : రజినీకాంత్ అరకోటి విరాళం..!
Rajinikanth : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు

Rajinikanth : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. వేలాదిమంది మృత్యువాత పడుతున్నారు. కరోనా బాధితులను రక్షించేందుకు ప్రభుత్వాలు, వైద్య సిబ్బంది తీవ్ర కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వానికి అండగా నిలిచేందుకు తమిళ సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌.. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కలిసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు. కాగా అయన కుమార్తె సౌందర్యరజినీకాంత్ సీఎం రిలీఫ్ ఫండ్‌కు కోటి రూపాయల విరాళాన్ని అందించిన సంగతి తెలిసిందే.. అటు హీరోలు కార్తి,సూర్య కోటి రూపాయలు, విక్రమ్‌ 30 లక్షలు, అజిత్ 25 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు.

Tags

Read MoreRead Less
Next Story