Republic Trailer: మేనల్లుడి సినిమాకు మెగాస్టార్ సపోర్ట్..

Republic Trailer: మేనల్లుడి సినిమాకు మెగాస్టార్ సపోర్ట్..
ఇటీవల కాలంలో సినిమా ప్రపంచంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న వార్త సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.

ఇటీవల కాలంలో సినిమా ప్రపంచంలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న వార్త సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై బైక్ స్కిడ్ అయ్యి పడిన తేజ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో మెగా అభిమానులంతా తాను వెంటనే కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు చేసారు. అయితే ఇటీవల చిరంజీవి, రామ్ చరణ్ సైతం సాయి ధరం తేజ్ వేగంగా కోలుకుంటున్నాడని, తన ఆరోగ్యం ఇప్పుడు నిలకడగానే ఉందని పలు సందర్భాల్లో వెల్లడించారు.

దీంతో తన ఫ్యాన్స్ కాస్త కుదుటపడ్డారు. సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సినిమాలు తీయడంలో పెద్ద స్పీడ్‌ను ఏమీ చూపించట్లేదు. తాను నటించిన రిపబ్లిక్ మూవీ షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తయినా దాని నుంచి ఇంతకాలం పెద్దగా అప్డేట్లు బయటికి రాలేదు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదలయ్యి కూడా చాలాకాలమే అయ్యింది. దేవ్ కట్టా దర్శకత్వం వహిస్తున్న రిపబ్లిక్ లో సాయి ధరమ్ తేజ్ కు జంటగా తమిళ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ నటిస్తోంది.



జగపతి బాబు, రమ్యక్రిష్ణ లాంటి సీనియర్లు ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దేవ్ కట్టా ముందు సినిమాలలాగానే ఇందులో కూడా కాస్త పొలిటికల్ టచ్ ఉన్నట్లు టీజర్ చూస్తే స్పష్టమవుతుంది. అయితే తాజాగా రిపబ్లిక్ ట్రైలర్ ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయించింది మూవీ టీమ్. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సాయి ధరమ్ తేజ్ పాల్గొనకపోయినా తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ పాల్గొని చిరుతో పాటు తాను కూడా టీమ్ కు బెస్ట్ విషెస్ ను తెలిపాడు.

Tags

Read MoreRead Less
Next Story