Samantha Ruth Prabhu: వారిద్దరికీ కంగ్రాట్స్ చెప్పిన సమంత..

Samantha Ruth Prabhu: వారిద్దరికీ కంగ్రాట్స్ చెప్పిన సమంత..
Samantha Ruth Prabhu: సినిమా వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే పురస్కారం ఆస్కార్.

Samantha Ruth Prabhu: సినిమా వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే పురస్కారం ఆస్కార్. ప్రపంచ నలుమూలల నుండి సినిమాలు ఆస్కార్ బరిలో నిలబడే ప్రయత్నం చేస్తాయి. కానీ అందులో చాలా తక్కువవాటికి మాత్రమే చివరి లిస్ట్‌లో ఉండే అవకాశం దక్కుతుంది. ఈసారి ఆ రేస్‌లో ఒక తమిళ చిత్రం కూడా ఉంది. అదే 'కూఱంగల్'. నయనతార, విఘ్నేశ్ శివన్ నిర్మించిన ఈ చిత్రం ఆస్కార్ వరకు వెళ్లడంతో సెలబ్రిటీలంతా వారికి అభినందనలు తెలుపుతున్నారు. ఇటీవల సమంత కూడా వారికి స్పెషల్‌గా విషెస్ తెలిపింది.



సమంత.. తన సోషల్ మీడియా వేదికగా నయనతార, విఘ్నేశ్ శివన్ ఇద్దరికీ విషెస్ తెలిపింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కూడా వారికి విషెస్ తెలిపాడు. తాను నటించిన సర్దార్ ఉద్దమ్ సినిమాను దాటి కూఱంగల్ ఆస్కార్ బరిలో నిలదడం విశేషం. ఇలాంటి ఒక చిన్న సినిమాను స్టార్లు సైతం ప్రోత్సహించడం చాలా గర్వకారణం.


ఇప్పటికే పలు నేషనల్, ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డులను దక్కించుకుంది 'కూఱంగల్'. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచి ఇండియన్ సినిమా తరపున అవార్డును దక్కించుకోవడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 22న 94వ అకాడెమీ అవార్డు ప్రదానోత్సవం అమెరికా లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో జరగనుంది. ఈ సినిమాకే అవార్డు రావాలని దర్శక నిర్మాతలతో పాటు మూవీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story