Siddharth: కుక్కలున్నాయని ట్వీట్ చేస్తే వాళ్లే కుక్కలు అనుకుంటే ఎలా?: సిద్ధార్థ్

Siddharth: కుక్కలున్నాయని ట్వీట్ చేస్తే వాళ్లే కుక్కలు అనుకుంటే ఎలా?: సిద్ధార్థ్
Siddharth: సమంత, నాగచైతన్యల విడాకుల గురించి ఎందరో సెలబ్రిటీలు తమ తమ సోషల్ మీడియాల ద్వరా స్పందించారు.

Siddharth: సమంత, నాగచైతన్యల విడాకుల గురించి ఎందరో సెలబ్రిటీలు తమ తమ సోషల్ మీడియాల ద్వరా స్పందించారు. అందులో కొందరు పాజిటివ్‌గా స్పందిస్తూ, మరికొందరు ఇన్‌డైరెక్ట్‌గా నెగిటివిటీని చూపించారు. వారి విడాకుల గురించి ప్రకటించిన రోజు హీరో సిద్ధార్థ్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. దాని గురించి సిద్ధు ఇటీవల ఒక స్పష్టత ఇచ్చాడు.

'మోసం చేసేవారు ఎప్పుడూ బాగుపడరు అని స్కూల్‌లో మా టీచర్' చెప్పింది అని సిద్ధార్థ్ పెట్టిన ట్వీట్ చాలా వైరల్‌గా మారింది. దీని గురించి సోషల్ మీడియాల్లో పెద్ద చర్చే నడిచింది. అయితే అది తాను మహాసముద్రం సినిమాలోని థీమ్‌ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసానని క్లారిటీ ఇచ్చాడు. 'మా ఇంటి ముందు కుక్కులు ఉన్నాయని ట్వీట్ చేస్తే ఎవరో వచ్చి నన్ను కుక్క అన్నావంటే నేనేం చేయాలి. నేను ఛీటర్స్ గురించి ట్వీట్ చేస్తే ప్రపంచంలో ఉన్న ఛీటర్స్ అంతా రియాక్ట్ అయితే నాకేం సంబంధం లేదు' అన్నాడు సిద్ధు. తాను రోజు చేసినట్టుగానే మామూలుగా ట్వీట్ చేసానని , అది ఎవరిని ఉద్దేశించింది కాదని చెప్పాడు.

ఇక సిద్ధు సినీ కెరీర్ విషయానికొస్తే తాను తెలుగు ప్రేక్షకులను పలకరించి దాదాపు 15 సంవత్సరాలు అయ్యింది. కానీ ఒకప్పుడు తాను చేసిన సినిమాలు సిద్ధును ప్రేక్షకులకు ఇంకా దగ్గరగానే ఉంచాయి. ఇక చాలాకాలం తర్వాత మహాసముద్రంతో ప్రేక్షకులను పలకరించనున్న సిద్ధు ఇది తనకు పెద్ద బ్రేక్ ఇస్తుందని భావిస్తున్నాడు. సినిమాల నుండి వచ్చిన గ్యాప్ గురించి మాట్లాడుతూ తాను కావాలనే కొంతకాలం గ్యాప్ తీసుకున్నట్టు వెల్లడించాడు.

Tags

Read MoreRead Less
Next Story