Trivikram Srinivas : త్రివిక్రమ్, ఉదయ్ కిరణ్ కాంబోలో 'అతడు' మూవీ ఎందుకు ఆగిపోయింది?

Trivikram Srinivas : త్రివిక్రమ్, ఉదయ్ కిరణ్ కాంబోలో అతడు మూవీ ఎందుకు ఆగిపోయింది?
Trivikram Srinivas : తరుణ్, రిచా హీరోహీరోయిన్లుగా వచ్చిన నువ్వేకావాలి సినిమా ఎంతపెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే..

Trivikram Srinivas : తరుణ్, రిచా హీరోహీరోయిన్లుగా వచ్చిన నువ్వేకావాలి సినిమా ఎంతపెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ముఖ్యంగా ఆ సినిమాలోని డైలాగ్స్‌‌కి వీపరితమైన క్రేజ్ వచ్చేసింది.. దీనితో త్రివిక్రమ్‌‌కి రైటర్ గా ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో దర్శకుడిగా చేసే మొదటిసినిమా తన బ్యానర్ లోనే చేయాలని అడ్వాన్స్ ఇచ్చి త్రివిక్రమ్‌‌ని లాక్ చేశారు నిర్మాత స్రవంతి రవికిషోర్.

అలా తరుణ్, శ్రియ మెయిన్ లీడ్‌‌లో దర్శకుడిగా త్రివిక్రమ్ ఫస్ట్ మూవీ నువ్వే నువ్వే స్టార్ట్ అయింది. దీనికి ముందే అతడు మూవీ స్క్రిప్ట్‌‌ని కూడా ఫినిష్ చేశారు త్రివిక్రమ్.. అప్పట్లో యూత్‌‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో ఉదయ్ కిరణ్‌‌తో ముందుగా ఈ సినిమాని చేయాలని అనుకున్నారట త్రివిక్రమ్.. నువ్వు నేను సినిమాతో పీక్స్ లోకి వెళ్ళిన ఉదయ్.. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. త్రివిక్రమ్ చెప్పిన అతడు మూవీ స్టొరీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. త్రివిక్రమ్.. జయభేరి ఆర్ట్స్‌‌లో ఈ సినిమాని చేయాలని అనుకున్నారు. త్రివిక్రమ్, ఉదయ్ కిరణ్ ఇద్దరు అడ్వాన్స్‌‌లు కూడా తీసుకున్నారట కానీ షూటింగ్ టైంకి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట ఉదయ్ కిరణ్.

ఆ తర్వాత ఈ కథని స్టార్ లతోనే చేయాలని అనుకున్నారు త్రివిక్రమ్.. ముందుగా పవన్ కళ్యాణ్ కి వెళ్లి కథ చెప్పగా ఆయన పది నిమిషాల పాటు కథ విని నిద్రపోయారు. అక్కడి నుంచి కామ్‌‌గా వెళ్ళిపోయిన త్రివిక్రమ్... నాని షూటింగ్‌‌లో ఉన్న మహేష్‌‌ని కలిసి కథని వినిపించారు.. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్.. పద్మాలయ స్టూడియో పైన ఈ సినిమాని చేద్దామని మహేష్.. త్రివిక్రమ్‌‌కు ఆఫర్ చేశారు. కానీ జయభేరి ఆర్ట్స్‌‌లో తన రెండో సినిమాకి కమిట్ అవ్వడంతో ఆ బ్యానర్ లోనే ఈ సినిమా తెరకెక్కింది.

విషయం ఏంటంటే 2001లో ఇదంతా జరగగా, 2005లో అతడు రిలీజైంది. ఇక ఈ సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్‌‌ని ఉదయ్ కిరణ్ రిటర్న్ ఇచ్చేశారట. అలా ఉదయ్ కిరణ్, త్రివిక్రమ్ కాంబో ఆగిపోయింది.

Tags

Read MoreRead Less
Next Story