తమన్నాకు రూ.2 కోట్ల విలువైన రింగ్ ను గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన.. నిజమేంటో తెలుసా?

తమన్నాకు రూ.2 కోట్ల విలువైన రింగ్ ను గిఫ్ట్ ఇచ్చిన ఉపాసన.. నిజమేంటో తెలుసా?
మరో సారి వార్తల్లోకెక్కిన తమన్నాకు ఉపాసన ఇచ్చిన డైమండ్ రింగ్

స్టార్ హీరో, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, వ్యాపారవేత్త ఉపాసన కామినేని 2019లో తమన్నాకు భారీ వజ్రాల ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ విలువైన బహుమతి ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ రింగ్ వెనుక నిజాలు, వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హల్ చల్ చేస్తునన్నాయి, అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తమన్నా భాటియా ఓ కొత్త వార్తతో ట్రెండింగ్ లోకి వచ్చారు. కానీ ఈ సారి ట్రోలింగ్ వల్లో, సినిమాలతోనే కాదు. ఆమె 2019లో ఉపాసన నుంచి పొందిన 'బహుమతి' గురించి. 2019లో చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' పూర్తయిన తర్వాత ఉపాసన కామినేని కొణిదెల తమన్నాకు భారీ వజ్రాల ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ఉపాసన బహుమతిగా ఇచ్చిన ఈ డైమండ్ రింగ్ విలువ 2 కోట్ల రూపాయలు అని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతే కాదు, ఇది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రమని కూడా పలువురు చెబుతున్నారు.

'సైరా నరసింహా రెడ్డి' షూటింగ్ తర్వాత, ఉపాసన తమన్నాకు భారీ వజ్రాల ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చింది. దీనికి సంబంధించి ఆమె ట్విట్టర్‌ ఫొటొలు కూడా షేర్ చేసింది. ఇప్పుడు, ఈ ఫొటోలు సోషల్ మీడియాలో మళ్లీ ప్రత్యక్షమయ్యాయి. అయితే అందరూ అనుకుంటున్నట్టు ఇది డైమండ్ రింగ్ కాదని తమన్నా అప్పట్లోనే వెల్లడించింది. 2019లో ఉపాసన "నిర్మాత నుండి సూపర్ తమన్నాకి బహుమతి. ఇప్పటికే మిమ్మల్ని మిస్ అవుతున్నాను. త్వరలో కలుసుకుందాం అంటూ ఉపాసన #SyeraaNarashimaReddy " అని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ పై స్పందించిన తమన్నా.. అది బాటిల్ ఓపెనర్ అని వెల్లడించింది. "ఈ బాటిల్ ఓపెనర్‌తో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. చాలా కాలం తర్వాత కలుసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది. మిమ్మల్ని చూడాలని వేచి చూస్తున్నాను. మిమ్మల్ని నేను కూడా చాలా మిస్ అవుతున్నాను" అంటూ తమన్నా బదులిచ్చింది.

ఇక తమన్నా చివరిసారిగా 'లస్ట్ స్టోరీస్ 2'లో తన ప్రియుడు విజయ్ వర్మతో జతకట్టింది. ఇప్పుడు ఆమె మెగాస్టార్ చిరంజీవి 'భోలా శంకర్', సూపర్ స్టార్ రజినీ కాంత్ 'జైలర్' లో నటించింది. ఇవి విడుదలకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇక ఇటీవల తమన్నా నటించిన ‘జైలర్’లోని ‘కావాలా’ పాట అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ రెండు చిత్రాలే కాకుండా తమన్నా చేతిలో 'అరణ్మనై 4, 'బాంద్రా', 'వేద' కూడా లైనప్ లో ఉన్నాయి.

ఇక ఇటీవలే ఆడపిల్లకు జన్మనిచ్చిన రామ్ చరణ్, ఉపాసన దంపతులు.. మెగా కుటుంబంలోకి ఓ కొత్త అతిథి రావడంతో ఆ ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లైన 11ఏళ్ల తర్వాత తమకు బిడ్డ పుట్టడంతో ఈ గ్యాప్ లో తాము ఎదుర్కొన్న ఒత్తిడి.. ఇప్పుడు తమ కుటుంబం పొందుతున్న ఆనందంపై ఇటీవలే ఉపాసన పుట్టిన రోజు సందర్భంగా చెర్రీ ఓ వీడియో కూడా విడుదల చేశారు. చాలా కాలం తర్వాత పుట్టిన ఆ పాపకు క్లీంకార అనే పేరు పెట్టినట్టు వారు గత కొన్ని రోజుల క్రితమే వెల్లడించారు.


Tags

Read MoreRead Less
Next Story