Vaishnavi Chaitanya : సిద్దు జొన్నలగడ్డతో జోడీ కట్టనున్న 'బేబీ' హీరోయిన్

Vaishnavi Chaitanya : సిద్దు జొన్నలగడ్డతో జోడీ కట్టనున్న బేబీ హీరోయిన్
బంపర్ ఆఫర్ కొట్టేసిన వైష్ణవి చైతన్య.. ఈ సారి సిద్దుతో రొమాన్స్

'డీజే టిల్లు'తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన జొన్నలగడ్డ ప్రస్తుతం మల్లిక్ రామ్ దర్శకత్వంలో 'డీజే టిల్లు స్క్వేర్' మూవీ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాను అక్టోబర్ 6న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీని తర్వాత 'బొమ్మరిల్లు' భాస్కర్ తో సిద్దు జొన్నలగడ్డ ఒక మూవీ చేయనున్నట్టు సమాచారం.

అయితే ఈ మూవీ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవలే విడుదలై, బాక్సాఫీస్ ను షేక్ చేసిన 'బేబీ'లో హీరోయిన్ గా చేసిన వైష్ణవి చైతన్య.. ఈ మూవీలో కథానాయికగా నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మూవీ త్వరలో ప్రారంభం కానుండగా ఇందులో సిద్దు కి జోడీగా వైష్ణవి చైతన్య నటించనున్నారని టాక్ నడుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ గ్రాండ్ గా నిర్మించనున్న ఈ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అతి త్వరలో రానున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో మూవీలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా వెల్లడి కానున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా.. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ ప్రధాన పాత్రలు పోషించిన 'బేబీ' సినిమా కల్ట్ క్లాసిక్ గా వచ్చింది. సాయి రాజేష్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్.. ముందు నుంచే అంచనాలను పెంచుతూ వచ్చాయి. ఇక విడుదల తర్వాత కూడా అదే ఎక్స్ప్టేషన్స్ కొనసాగాయి. కేవలం మౌత్ టాక్ తోనే ఈ సినిమా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకుంది.


Tags

Read MoreRead Less
Next Story