హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సందడి షురూ.. పెరిగిన మెట్రో రైళ్లు

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సందడి షురూ.. పెరిగిన మెట్రో రైళ్లు

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ సందడి మొదలైంది. ఇవాళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ జరుగనుంది. అదేవిధంగా ఉప్పల్‌ స్టేడియం లో ఏడు మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని అధికారులు నిర్ణయించారు. రద్దీ దృష్ట్యా నాగోల్‌-అమీర్‌పేట్‌ మార్గంలో ఎక్కువ సంఖ్యలో మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల నుంచి అధిక సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయన్నా రు. మ్యాచ్‌ నేపథ్యంలో ప్రేక్షకుల కోసం నిర్వాహకులు స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.

Tags

Read MoreRead Less
Next Story