సెలెక్టర్లు కావలెను.. బీసీసీఐ ప్రకటన
సీనియర్ సెలెక్షన్ కమిటీలో త్వరలో ఖాళీ అవుతున్న సెలెక్టర్లను భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతూ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులకు ఈనెల 15 ఆఖరి తేదీ అని ప్రకటనలో పేర్కొంది.
కమిటీలోని దేవాంగ్ గాంధీ (ఈస్ట్జోన్), శరణ్దీప్ సింగ్ (నార్త్జోన్), జతిన్ పరాంజన్ (వెస్ట్జోన్) ల పదవీ కాలం ఇదివరకే ముగిసినా.. ఆసిన్ పర్యటన కోసం జట్లను ఎంపిక చేసేందుకు పొడిగింపు ఇచ్చింది. జట్ల ఎంపిక పూర్తి కావడంతో ఇక సెలెక్టర్ల భర్తీపై బోర్డు దృష్టిసారించింది. ఇప్పటికే సౌత్జోన్ నుంచి ఖాళీ అయిన ఎమ్మెస్కే ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్) స్థానంలో సునీలో జోషి (కర్ణాటక), సెంట్రల్ జోన్లో గగన్ ఖోడా స్థానంలో హర్వీందర్ సింగ్లను నియమించింది.
అర్హతలు..
అంతర్జాతీయ అనుభవం లేకపోయినా, కనీసం 30 దేశవాళీ మ్యాచ్లు ఆడిన క్రికెటర్లు సెలెక్టర్ల పదవులకు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయసు 60 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్లో 7 టెస్టులు లేదంటే 10 వన్డేలు, 20 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవమైనా ఉండాలి. అయితే ఈసారి అంతర్జాతీయ అనుభవం ఉన్న వారిరే ప్రాధాన్యత అని ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. 30 దేశవాళీ మ్యాచ్లు ఆడినా పరిగణిస్తామని తెలిపింది.
సెలెక్షన్ కమిటీ కోసం ఇటీవల దరఖాస్తు చేసుకున్న మాజీ సీమర్ అజిత్ అగార్కర్, మణీందర్ సింగ్ల ఎంపికను కూడా పరిశీలిస్తారు. దరఖాస్తుల స్కూటినీ అయిన వెంటనే మదన్ లాల్ నేతృత్వంలోని క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) అర్హత గల అభ్యర్ధుల్ని ఇంటర్వ్యూ చేస్తుంది. అనంతరం ఈ సీనియర్ సెలెక్షన్ కమిటీ భారత్తో పాటు భారత్ 'ఎ', దులీప్ ట్రోపీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫె, రెస్టాఫ్ ఇండియా జట్లను ఎంపిక చేస్తుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com