మాటల్లేవ్.. కుమ్మేశారంతే..!

మాటల్లేవ్.. కుమ్మేశారంతే..!
సిరీస్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత జట్టు ఆదరగోట్టింది. విజేతను నిర్ణయించే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది.

సిరీస్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత జట్టు ఆదరగోట్టింది. విజేతను నిర్ణయించే మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ కి దిగిన భారత జట్టు నిర్ణిత 20 ఓవర్లలో భారీ స్కోర్ చేసింది. ప్రతి ఓవర్ కి ఎక్కడ కూడా 10 పరుగులు తగ్గకుండా స్కోర్ చేస్తూ వచ్చింది. దీనితో 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ కోహ్లీ (80), రోహిత్ శర్మ(64), పాండ్యా (39), సూర్య కుమార్ యాదవ్ (32) పరుగులు చేశారు. ప్రతి బ్యాట్స్ మెన్ హిట్టింగ్ ఆడడంతో ఇంగ్లండ్ బౌలర్లు చుక్కలు చూశారు. ఇంగ్లండ్ బౌలర్లలలో రషీద్, స్టోక్స్ చెరో వికెట్ తీశారు. టీ20లలో ఇంగ్లండ్ జట్టు పైన భారత్ కి ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం..!

Tags

Read MoreRead Less
Next Story