IPL: నేడే ఐపీఎల్‌ ఆరంభం.. గురుశిష్యుల మధ్యే తొలి పోరు

IPL: నేడే ఐపీఎల్‌ ఆరంభం.. గురుశిష్యుల మధ్యే తొలి పోరు
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ ఢీ కొడుతుంది

వేసవి వినోదాన్ని అందించేందుకు ఐపీఎల్‌ సిద్ధమైంది. 16వ సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ ఢీ కొడుతుంది. గతేడాదే లీగ్‌లో అడుగుపెట్టి.. సంచలన ప్రదర్శనతో విజేతగా నిలిచిన గుజరాత్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. మరోవైపు కేవలం ఐపీఎల్‌ మాత్రమే ఆడుతున్న ధోనీ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. అతని సారథ్యంలోని చెన్నై జట్టు ఎప్పటిలాగే బలంగా ఉంది.

మొదటి మ్యాచ్‌లో గెలిచి గ్రాండ్‌గా సీజన్‌ను ఆరంభించాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. అయితే హార్ధిక్‌ పాండ్యా ధోనీకి వీరాభిమాని కావడంతో మహీ నుంచి పాఠాలు చాలానే నేర్చుకున్నాడు. దీంతో గురుశిష్యుల మధ్య తొలి మ్యాచ్‌ జరగనుండగా ఈ మ్యాచ్‌ చాలా ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story