IPL: ఉప్పల్లో మొదటి మ్యాచ్.. భద్రత కట్టుదిట్టం
By - Subba Reddy |1 April 2023 12:15 PM GMT
హైదరాబాద్ను ఐపీఎల్ ఫివర్ తాకింది
హైదరాబాద్ను ఐపీఎల్ ఫివర్ తాకింది. ఐపీఎల్ -16లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్.. రేపు తన తొలి మ్యాచ్ను ఉప్పల్ లో ఆడనుంది. ఈ మేరకు భారీ భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహన్ తెలిపారు. 15వందల మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాటు చేశామన్నారు. అందరి సమన్వయంతో క్రికెట్ మ్యాచ్ను విజయవంతం చేస్తామన్నారు. ఇక బ్లాక్ టికెట్లపై నజర్ పెట్టామన్న చౌహన్.. సీసీ కెమెరాలతో నిఘా పెంచామన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com