చెలరేగిన రోహిత్.. భారీ స్కోర్ దిశగా భారత్.. !
By - TV5 Digital Team |20 March 2021 2:45 PM GMT
సిరీస్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇంగ్లండ్ బౌలర్లకి చుక్కలు చూపిస్తున్నారు. ఓవర్ కి 10 రన్స్ తక్కువ కాకుండా ఆడుతూ వచ్చారు.
సిరీస్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇంగ్లండ్ బౌలర్లకి చుక్కలు చూపిస్తున్నారు. ఓవర్ కి 10 రన్స్ తక్కువ కాకుండా ఆడుతూ వచ్చారు. రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి.. కేవలం 30 బంతుల్లోనే హైఫ్ సెంచరీ చేశాడు. మొత్తం 34 బంతుల్లో 64 పరుగులు చేసి స్ట్రోక్స్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. ఇందులో నాలుగు ఫోర్లు, అయిదు సిక్సులున్నాయి. ప్రస్తుతం భారత జట్టు 11 ఓవర్లకి గాను 139 పరుగులుగా ఉంది. విరాట్ కోహ్లీ (37), సూర్య కుమార్ యాదవ్ (31) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com