మధ్యప్రదేశ్‌లో ఎన్ కౌంటర్... ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతి

మధ్యప్రదేశ్‌లో ఎన్ కౌంటర్... ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతి

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో శనివారం ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా నక్సలైట్లు మృతిచెందారు. వీరిపై రూ.28 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరణించిన నక్సలైట్లు.... భోరమ్‌దేవ్ కమిటీ కమాండర్, ఏరియా కమిటీ సభ్యురాలు సునీత, సరితా ఖతియా మోచాగా గుర్తించామని తెలిపారు. గర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని కడ్లా అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది.

ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు
మహిళా నక్సలైట్ల నుంచి తుపాకులు, కాట్రిడ్జ్‌లు, పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు బాలాఘాట్ పోలీసులు. ఎన్ కౌంటర్ అనంతరం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దశాబ్దాలుగా నక్సలైట్ల సమస్యలతో పోరాడుతున్న బాలాఘాట్ పోలీసులు గతేడాది ఆరుగురు పేరుమోసిన నక్సలైట్లను హతమార్చారు. నక్సలైట్ల ఎన్‌కౌంటర్ గురించి సమాచారం అందుకున్న బాలాఘాట్ జోన్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సంజయ్ కుమార్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సమీర్ సౌరభ్, హాక్‌ఫోర్స్ సీఓ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story