Crime : వివాహేతర సంబంధం... ప్రియుడితో కలిసి కన్న పిల్లలనే చంపింది

Crime : వివాహేతర సంబంధం... ప్రియుడితో కలిసి కన్న పిల్లలనే చంపింది
కూతురిని సొంత ఇంట్లోనే చంపింది. కొడుకును పక్కింట్లో చంపి తీసుకెళ్లి మురికి కాలువలో పడేసింది.


ప్రియుడి సహాయంతో కన్న పిల్లలనే చంపింది ఓ తల్లి. ఈఘటన ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. ఓ మహిళ స్థానిక కౌన్సిలర్ అయిన తన ప్రేమికుడితో కలిసి తన 10ఏళ్ల కొడుకును, ఆరేళ్ల కుమార్తెను హత్య చేసింది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం ఈ ఘటన జరిగింది. పిల్లలను చంపిన తర్వాత వారి మృతదేహాలను కాలువలో పడేశారు. ఈ కేసులో మహిళ ఇరుగుపొరుగు వారి ప్రమేయం కూడా ఉందని పోలీసులు తెలిపారు. జంట హత్యలతో సంబంధం ఉన్న ఆరుగురిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేశారు. చిన్నారుల మృతదేహాలు ఇంకా వెలికితీయాల్సి ఉంది.

"మార్చి 22న, 10 ఏళ్ల బాలుడు మరియు ఆరేళ్ల బాలికను హత్య చేసి, వారి మృతదేహాలను వారి తల్లి, ఆమె ప్రేమికుడై స్థానిక కౌన్సిలర్ సౌద్‌తో కలిసి కాలువలో విసిరారు. వారికి ఇరుగుపొరుగు వారి సహాయం చేసినట్లు తెలుస్తోంది. పిల్లలు తప్పిపోయినప్పుడు, కేసు నమోదు చేయబడింది. విచారణలో నిజాలు వెల్లడయ్యాయి" అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పీయూష్ సింగ్ తెలిపారు.

"ఈ హత్యలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. బాలికను ఆమె ఇంట్లోనే చంపారు, అబ్బాయిని పొరుగువారి ఇంట్లో చంపారు. పిల్లల మృతదేహాలు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. నిందితులందరినీ అరెస్టు చేశాము" అని ఎస్పీ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story