Bhopal: రూ.40 వేలకు కన్నకూతురునే అమ్మేశారు...
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్కు సమీపంలోని గునగా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో జూన్ 27న 12 ఏళ్ల గిరిజన బాలికకు 27 ఏళ్ల యువకుడితో జరుపుతున్న వివాహాన్ని అధికారులు అడ్డుకుని.. పలువురిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు బహిర్గతమయ్యాయి.
తల్లిదండ్రులు బాలికను రూ. 40 వేలకు విక్రయించారని, రూ.20 వేలు అడ్వాన్స్ తీసుకున్నారని తేలింది. పెళ్లి తర్వాత మిగిలిన సొమ్మును ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. రూ. 40 వేలు తీసుకొని తన పెళ్లిని తల్లిదండ్రులు నిశ్చయించారని బాలిక పోలీసులకు చెప్పినట్లు ఎస్పీ తెలిపారు. మానవ అక్రమ రవాణా, జువైనల్ జస్టిస్ యాక్ట్, బాల్య వివాహాల నిషేధ చట్టం కింద బాలిక తల్లిదండ్రులు, పెళ్లికొడుకు, అతని తల్లిదండ్రులతో సహా అయిదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని పెళ్లికి సహకరించిన వారిని కేసులో ప్రమేయం ఉన్నవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com