AP : ఐదు దుప్పి పిల్లలను చంపిన వేటగాళ్లు
By - Vijayanand |2 March 2023 7:19 AM GMT
గాలేరు వాగు సమీపంలోని మామిడితోటలో దుప్పిమాంసాన్ని కోస్తుండగా ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారు
నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ వెలుగోడు రేంజ్ పరిథిలో ఐదు దుప్పి పిల్లలను వేటగాళ్లు చంపారు. గాలేరు వాగు సమీపంలోని మామిడితోటలో దుప్పిమాంసాన్ని కోస్తుండగా ఫారెస్ట్ అధికారులు దాడులు చేశారు. . అధికారుల రాకను గమనించి వేటగాళ్లు పరారయ్యారు. స్మగ్లర్ల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్మగ్లర్లు అడవి జంతువులను వేటాడుతున్నా ఫారెస్ట్ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com