AP Girl Suicide: పెళ్లిపీటలు ఎక్కాల్సిన రోజే ప్రాణాలు తీసుకుంది..
AP Girl Suicide: బాగా చదువుకుంది.. అమెరికాలో ఉద్యోగం చేస్తుంది.. పెళ్లి చేసుకుంటానన్న యువకుడు ప్లేటు ఫిరాయించేసరికి మనస్థాపంతో తల్లడిల్లి పోయింది.. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నిష్కారణంగా నిండు జీవితానికి ముగింపు పలికింది చిత్తూరు జిల్లాకు చెందిన సుష్మ. నగరంలోని పోలీసు కాలనీకి చెందిన శ్రీహరి కుమార్తె సుష్మ (25) అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది.
జిల్లాలోని పూతల పట్టు మండలం బందార్లపల్లికి చెందిన మురళి కుమారుడు భరత్ టెక్సాస్లో సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇరుకుటుంబాల సభ్యులు మాట్లాడుకుని పెళ్లి నిశ్చయించారు. ఈనెల 3వ తేదీన పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. పెళ్లి పత్రికలు ముద్రించి అందరికీ పంచారు. ఇదిలా ఉంటే టక్సాస్లోనే ఉన్న సుష్మ, భరత్ల మధ్య విభేదాలు వచ్చాయి.
దాంతో భరత్ ఇప్పుడే తనకు పెళ్లి వద్దని, మరి కొద్ది రోజులు సమయం కావాలని తల్లిదండ్రులను అడిగాడు. ఇరు కుటుంబాల వారు ఇద్దరికీ నచ్చజెప్పారు. కొద్ది రోజుల తరువాత అన్నీ సర్ధుకుంటాయని నచ్చజెప్పారు. అయినా సుష్మ అవమానంగా భావించింది. తీవ్ర మనస్థాపానికి గురైన సుష్మ పెళ్లి జరగాల్సిన రోజే బాత్రూమ్ లోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com