దారుణం.. పదహారేళ్ల బాలికను హత్యచేసిన ఆటో డ్రైవర్
By - Nagesh Swarna |7 Feb 2021 10:06 AM GMT
Auto Driver Kills Minor Girl in Medak District
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం సోమ్లా తండాలో దారుణం చోటుచేసుకుంది. పదహారేళ్ల బాలికను ఆటో డ్రైవర్ వీరేశం మాయమాటలు చెప్పి లోబరుచుకొని హత్య చేశాడు. పైగా బాలికను నమ్మబలికి హైదరాబాద్ వట్టి నాగులపల్లిలో అద్దె ఇళ్లు తీసుకొని రెండు నెలల పాటు సహజీవనం చేశాడని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
రెండు నెలల అనంతరం తనను పెళ్లి చేసుకోమని బలవంతం చేయగా.. ఆటో డ్రైవర్ వీరేశం బాలికను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com