Bengaluru : పార్క్ నుంచి ఎత్తుకెళ్లి అత్యాచారం..! నిందితులు అరెస్ట్

Bengaluru : పార్క్ నుంచి ఎత్తుకెళ్లి అత్యాచారం..! నిందితులు అరెస్ట్

ఓ యువతిని పార్క్ నుంచి ఎత్తుకెళ్లి కారులో అత్యాచారం చేశారు దుండగులు. ఈ ఘటన బెంగళూరులో మర్చి 25న జరిగినట్లు పోలీసులు తెలిపారు. మార్చి 25, 2023 అర్ధరాత్రి ఓ యువతి తన స్నేహితుడితో బెంగళూరు కోరమంగళలోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్క్ లో కూర్చుని ఉంది. అంతలోనే ఇద్దరు దుండగులు వచ్చి అర్థరాత్రి పార్క్ లో ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. భయానికి గురైన యువకుడు యువతిని అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. బెధిరింపులకు దిగిన ఇద్దరు మరో ఇద్దరు స్నేహితులను పిలిచి యువతిని బలవంతగా పార్క్ బయట ఉన్న కారులోకి ఎత్తుకెళ్లారు. కారు కోరమంగళ్ రోడ్లపై ప్రయాణిస్తుండగా యువతిని బలాత్కారం చేశారు. మరుసటి రోజు తెల్లవారుజామున యువతిని ఆమె ఇంటి పరిసరాల్లో దిగబెట్టారు. పోలీసులకు చెప్పొందంటూ బెధిరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అత్యాచార బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story