Peddapalli: ప్రేమోన్మాది ఘాతుకం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి గొంతుకోసి..

Peddapalli (tv5news.in)

Peddapalli (tv5news.in)

Peddapalli: తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కవద్దనే కోపంతో యువతి గొంతుకోసి చంపాడో ప్రేమోన్మాది.

Peddapalli: తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కవద్దనే కోపంతో యువతి గొంతుకోసి చంపాడో ప్రేమోన్మాది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా యైటింక్లయిన్‌ కాలనీలో చోటుచేసుకుంది. రామగిరి మండలం వెంకట్రావుపల్లికి చెందిన గొడుగు అంజలి, యైటింక్లయిన్‌ కాలనీలోని తారకరామానగర్‌కు చెందిన ట్రాక్టర్‌ కూలీ చాట్ల రాజు కొంతకాలం ప్రేమించుకున్నారు.

ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు అభ్యంతరం తెలిపారు. అంజలి కొద్దిరోజులుగా రాజును పూర్తిగా దూరం పెట్టింది. తనను పెళ్లిచేసుకోవాలని రాజు పలుమార్లు ఒత్తిడి తీసుకురాగా.. కుదరదని స్పష్టం చేసింది. ఆమెపై ఆగ్రహం పెంచుకున్న రాజు.. రెండు రోజులుగా ఫోన్‌ చేస్తూ, తనను పెళ్లిచేసుకోవాలని లేకుంటే చంపేస్తానని బెదిరిస్తూ వచ్చాడు.

అంజలి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అక్కడికి వచ్చి.. ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోశాడు. అంతటితో ఆగకుండా ఇంట్లో ఉన్న కత్తిపీటతో గొంతు నరికి పరారయ్యాడు. వెంకటేష్‌ అనే యువకుడు జాబ్‌కార్డు ఇచ్చేందుకు ఆ ఇంటికి వెళ్లాడు. రక్తపు మడుగులో అంజలి మృతదేహం చూసి.. స్థానికులకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

తనకు దక్కని అంజలి మరో వ్యక్తికి దక్కకూడదనే ఉద్దేశంతోనే రాజు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అంజలి తండ్రి కొన్నేళ్ల క్రితం చనిపోయాడు. కుటుంబం ఆలనాపాలనా తల్లి లక్ష్మి చూసుకుంటోంది. నిందితుడు రాజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story