సిరిసిల్లాలో దారుణం.. అప్పుడే పుట్టిన పసికందును వదిలివెళ్లిన కసాయి తల్లి..!

సిరిసిల్లాలో దారుణం.. అప్పుడే పుట్టిన పసికందును వదిలివెళ్లిన కసాయి తల్లి..!
Siricilla : దీపావళి రోజున అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలివెళ్లిన దారుణ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

Siricilla : దీపావళి రోజున అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన వదిలివెళ్లిన దారుణ ఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. అవావాస్య రోజు పుట్టిందనో, లేక మరో కారణమే కానీ పసికందును కసాయివాళ్లు... పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలో వదిలివెళ్లారు. పసికందు ఏడుపులు విన్న పోలీసులు అక్కడికి చేరుకుని... ఆరుబయట చలిలో వణుకుతున్న పసికందును ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. పసికందును పరీక్షించిన వైద్యులు తగిన వైద్యాన్ని అందిస్తున్నారు. పసికందును ఎవరు వదిలివెళ్లార్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story