వంట మనిషి అరాచకం.. యజమానికి భోజనంలో మత్తుమందు పెట్టి..

X
Nagesh Swarna6 Oct 2020 9:37 AM GMT
భాగ్యనగరంలో నేపాలీ గ్యాంగ్ మరోసారి హల్ చల్ చేసింది. వాచ్మెన్, వంటమనుషులుగా చేస్తూ ఇంటికి కన్నం వేశారు. తాజాగా రాయదుర్గంలో నేపాలీ దంపతులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి డిన్నర్లో ఇంటియజమానికి మత్తుమందు కలిపి 30లక్షల సొత్తుతో ఉడాయించారు. ఇంట్లో పనిమనుషులుగా చేరి ఈ దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన నగరంలో ఇది మూడోసారి. గతంలో జనవరిలో కోకాపేటలోమత్తుమందు ఇచ్చి కోటికిపైగా నగదు చోరీ చేశారు. ఆగస్టులో సైనిక్ పురిలో ఇంట్లో దోపిడీకి పాల్పడ్డారు. ఈ కేసులు దర్యాప్తుచేస్తుండగానే రాయదుర్గంలోని డిఎన్ ఆర్ హిల్స్లో దోపిడీకి దిగారు. బోర్ వెల్ కాంట్రాక్టర్ గూడూరు మధు సూధన్ రెడ్డి ఇంట్లో 15లక్షల నగదు, బంగారం చోరీకి పాల్పడిందిఈ నేపాలి గ్యాంగ్.
Next Story