లాడ్జిలో కుమార్తెను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి
By - Nagesh Swarna |4 Sep 2020 8:58 AM GMT
భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే కారణంతో.. కూతురిని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు..
చిత్తూరులో విషాదకరమైన ఘటన జరిగింది. భార్యకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందనే కారణంతో మనస్తాపం చెందిన గణేష్ అనే వ్యక్తి కూతురిని చంపేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరులోని ఓ లాడ్జ్లో రూమ్ తీసుకుని.. ముందు కూతురికి ఉరివేసి చంపేశాడు. తర్వాత తానూ ఉరి బిగించుకుని ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. గణేష్ది చిత్తూరులోని ప్రశాంత్ నగర్గా గుర్తించారు. లాడ్జ్ రూమ్లో సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com