Hyderabad: ఉగ్ర కదలికల కలకలం

Hyderabad: ఉగ్ర కదలికల కలకలం
నగరంలో మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సల్మాన్ సైతం అదుపులోకి తీసుకున్నారు

హైదరాబాద్‌లో ఉగ్రవాద కదలికలు కలకలం రేపుతున్నాయి. నగరంలో మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న సల్మాన్ సైతం అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో అరెస్ట్‌ అయిన ఆరుగురు, భూపాల్‌లో పట్టుబడిన 11 మందిని ఏటీఎస్ అధికారులు ప్రత్యేక భద్రత మధ్య కోర్టులో హాజరుపర్చారు. 17మందికి భూపాల్ ప్రత్యేక న్యాయస్థానం మే 19 వరకు కస్టడీ విధించింది. అటు ఈ ఉగ్ర కుట్రలో కీలక విషయాలు బయటపడుతున్నాయి.

విచారణలో భూపాల్ టు హైదరాబాద్‌కు ఉగ్రవాదుల లింక్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దాడుల కోసం అడవుల్లో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నట్లు పోలీసులు అనుమావిస్తున్నారు. ఒకరితో మరొకరికి నేరుగా కాంటాక్టు లేకుండా డార్క్ వెబ్ ద్వారా సంప్రదింపులు చేస్తున్నట్లు సమాచారం. పెద్ద నగరాలను టార్గెట్ చేసుకున్న నిందితులు అక్కడే సాధారణ పౌరులుగా స్థిరపడినట్లుగా తెలుస్తోంది.

కేంద్ర ఇంటలిజెన్స్ సాయంతో మంగళవారం భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ తో పాటు తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ ను నిర్వహించి 17మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, ఉగ్ర సాహిత్యం, కత్తులు, ఎలక్ట్రానిక్ డివైజ్, డ్రాగులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ఇస్లామిక్ జీహాదీని కూడా పోలీసులు గుర్తించారు. వీరంతా 18 నెలల నుంచి హైదరాబాద్ లోనే మకాం వేశారు. యువకులను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Tags

Read MoreRead Less
Next Story