Kottagudem: భద్రాద్రిలో గంజాయి స్మగ్లర్ల హల్ చల్

Kottagudem: భద్రాద్రిలో గంజాయి స్మగ్లర్ల హల్ చల్
కానిస్టేబుల్ ను ఢీకొట్టి పారిపోవడానికి ప్రయత్నం; విద్యుత్ స్తంభానికి ఢీకొట్టి పోలీసులకు చిక్కిన వైనం...

భద్రాద్రి కొత్త జిల్లాలో గంజాయి స్మగ్లర్లు హల్‌చల్‌ సృష్టించారు. కారులో గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారంతో చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఆ సమయంలోనే గంజాయిని తరలిస్తున్న కారు అక్కడికే వచ్చింది. పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించగా కానిస్టేబుల్ ను ఢీకొట్టి పారిపోవడానికి ప్రయత్నించారు. టెన్షన్ కు గురైన స్మగ్లర్లు అక్కడే ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొట్టారు.

భద్రాద్రి నుంచి హైదరాబాద్ కు గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డారు స్మగ్లర్లు. ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్దనుంచి రూ.21లక్షల విలువైన 350 కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story