Hyderabad: విద్యార్థుల ప్రేమ కథ.. ప్రియుడ్ని కిడ్నాప్ చేయించిన యువతి

Hyderabad: విద్యార్థుల ప్రేమ కథ.. ప్రియుడ్ని కిడ్నాప్ చేయించిన యువతి
డబ్బులు తీసుకున్న ఆ యువతి , అవినాష్ రెడ్డికి దూరంగా ఉంటూ మరో ప్రేమాయణం మొదలు పెట్టింది

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్లో అవినాష్ రెడ్డి అనే స్టూడెంట్‌ని కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. ప్రేమించిన యువతే కిడ్నాప్ చేయించినట్లు తెలుస్తోంది. కిడ్నాప్ వ్యవహారంలో బీజేపీ నేత ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి తన క్లాస్ మేట్ అయిన యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తనకు డబ్బు అవసరం ఉందని, డబ్బుకావాలంటూ అవినాష్ రెడ్డిని అడిగింది ప్రియురాలు. దీంతో ఆమెకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చాడు. డబ్బులు తీసుకున్న ఆ యువతి , అవినాష్ రెడ్డికి దూరంగా ఉంటూ మరో ప్రేమాయణం మొదలు పెట్టింది. ఇది తెలుసుకున్న అవినాష్ రెడ్డి.. ప్రియురాలితో వాగ్వాదానికి దిగాడు. తన డబ్బులు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.

ఆ యువతి సిద్ధిపేట్ బీజేపీ నేత చక్రధర్ గౌడ్ తో ఫోన్ చేయించి బెదిరింపులకు గురి చేసింది. అవినాష్ దగ్గర ఉన్న ఆమె ఫొటోలు, వీడియోలు తొలగించకపోతే డబ్బులు ఇవ్వవని చక్రధర్ గౌడ్ బెదించినట్లు తెలుస్తోంది. నీతో మాట్లాడాలంటూ వరంగల్ హైవేపై ఉన్న వందన హోటల్ కి రమ్మన్నాడు చక్రధర్‌. అతని మాటలు నమ్మి వెళ్లిన అవినాష్ రెడ్డిని తన అనుచరులతో కలిసి కిడ్నాప్‌కు యత్నించాడు చక్రధర్‌. వారి నుంచి తప్పించుకున్న అవినాష్ రెడ్డి..పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story