కిడ్నాప్ చేస్తున్న జంట గుట్టురట్టు

కిడ్నాప్ చేస్తున్న జంట గుట్టురట్టు
2 గంటల్లో 2 కిడ్నాప్‌ కేసులను ఛేదించారు. ప్యారడైజ్ వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మూడున్నరేళ్ల చిన్నారిని.. ఓ జంట ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లింది

హైదరాబాద్‌లో పిల్లలను కిడ్నాప్ చేస్తున్న ఓ జంట గుట్టురట్టు చేశారు మహంకాళి పోలీసులు. 2 గంటల్లో 2 కిడ్నాప్‌ కేసులను ఛేదించారు. ప్యారడైజ్ వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న మూడున్నరేళ్ల చిన్నారిని.. ఓ జంట ఆటోలో వచ్చి ఎత్తుకెళ్లింది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత కాసేపటికే అదే జంట సుల్తాన్ బజార్ వద్ద ఫుట్‌పాత్‌పై తల్లిదండ్రులతో కలిసి నిద్రిస్తున్న ఏడు నెలల బాలుడిని ఎత్తుకెళ్లింది. గంటల వ్యవధిలోనే ఇద్దరు పిల్లలను కిడ్నాప్‌ చేశారు.

చిన్నారుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆటో నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పిల్లలను కిడ్నాప్ చేసిన ఇమ్రాన్, ప్రవీణను అరెస్ట్ చేశారు. ఫలక్‌నుమాకు చెందిన ఇమ్రాన్‌.. నిజామాబాద్‌కు చెందిన ప్రవీణ.. పరిచయం ఏర్పడిన కొద్ది గంటల్లోనే ఇద్దరు కలిసి పిల్లలను కిడ్నాప్‌ చేసేందుకు ప్లాన్‌ చేశారు. సీసీ కెమెరా ఫుటేజీతో పోలీసులకు దొరికిపోయారు. కిడ్నాపైన ఇద్దరు పిల్లలను తల్లిదండ్రులకు అప్పగించారు. డబ్బు ఆశతో నిందితులు పిల్లలను అపహరించారని నార్త్‌జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story