Warangal : నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన దంపతులు అరెస్ట్..!

Warangal : నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించిన దంపతులు అరెస్ట్..!
వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు పది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ లో నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు పది లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బుతో పాటుగా కలర్ ప్రింటర్, బాండ్ పేపర్లు, కటర్ ను స్వాధీనం చేసుకున్నారు. కాశీబుగ్గ తిలక్ రోడ్డు ప్రాంతానికి చెందిన రమేష్, సరస్వతి దంపతులు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా నకిలీ నోట్లను ముద్రించి రద్దీ ప్రాంతాల్లో చలామణి చేయాలని ప్రణాళికలు రూపొందించారు. ముద్రించిన కరెన్సీ ని హన్మకొండ వరంగల్ లోని రద్దీ ప్రాంతాల్లో చలామణి చేసేవారు. అయితే గత కొన్ని రోజులుగా వరంగల్ లోని ట్రై సిటీ పరిధిలోని షాపుల్లో నకిలీ నోట్ల చలామణి పై ఫిర్యాదులు వచ్చాయి. దీనితో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. రమేష్ సరస్వతి దంపతుల ఇంటి పై దాడి నిర్వహించారు ముద్రించే సామాగ్రితో పాటు నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేశారు.



Tags

Read MoreRead Less
Next Story