Shamshabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో హెరాయిన్‌ పట్టివేత.. విలువ దాదాపు రూ. 22 కోట్లు..

Shamshabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో హెరాయిన్‌ పట్టివేత.. విలువ దాదాపు రూ. 22 కోట్లు..
Shamshabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది.

Shamshabad: శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. నైరోబీ నుంచి హైదరాబాద్‌ వచ్చిన మలావియన్‌ దేశస్తురాలి నుండి 3.129 కిలోల హెరాయిన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు నైరోబీ నుండి ఖతార్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానంలో దోహా మీదుగా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన హెరాయిన్‌ విలువ దాదాపు 22 కోట్లు ఉంటుందని తెలిపారు. సూట్‌కేస్‌ అడుగులో హెరాయిన్‌ దాచి తెచ్చినట్లు వెల్లడించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న డీఆర్‌ఐ అధికారులు.. హెరాయిన్‌ను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయంపై ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story