Hyderabad: మారేడ్‌పల్లి సీఐపై కేసు.. రేప్ చేశాడని బాధిత మహిళ కంప్లైంట్..!

Hyderabad: మారేడ్‌పల్లి సీఐపై కేసు.. రేప్ చేశాడని బాధిత మహిళ కంప్లైంట్..!
Hyderabad: హైదరాబాద్‌ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై అత్యాచార కేసు నమోదైంది. రేప్ చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

Hyderabad: హైదరాబాద్‌ మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావుపై వనస్థలిపురం.. పీఎస్‌లో అత్యాచార కేసు నమోదైంది. స్థానిక వెంకటరమణా కాలనీకి చెందిన ఓ మహిళ సీఐపై తీవ్ర ఆరోపణలు చేసింది. తన భర్త పై దాడి చేసి.. సీఐ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తన భర్తతో పాటు తనను.. బలవంతంగా కారులో ఎక్కించుకొని ఇబ్రహీంపట్నం వైపు తీసుకెళ్లారని పేర్కొంది. అయితే మధ్యలో కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో.. తమ ప్రాణాలు దక్కాయని తెలిపింది. లేకపోతే సీఐ తమను హత్య చేసేవాడని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story