విశాఖలో దడపుట్టిస్తోన్న వరుస రోడ్డు ప్రమాదాలు

విశాఖలో దడపుట్టిస్తోన్న వరుస రోడ్డు ప్రమాదాలు

విశాఖలో వరుస రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో 3 యాక్సిడెంట్‌లు జరిగాయి. ఈ నెల 2న వీఐపీ రోడ్, అలాగే వేరు వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ వరుస ప్రమాదాల బీభత్సంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే సోమవారం విశాఖ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో అదుపుతప్పి.. అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం పై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు, బైక్ ధ్వంసం అయ్యాయి.

రుషికొండ సాగరతీరంలోని రాడిసన్ బ్లూ హోటల్ గేట్ నెం 1 వద్ద సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మిగిలిన వారిని చికిత్స కోసం కేజీహెచ్‌కు తరలించారు. మిగిలిన వాళ్ళను చికిత్స నిమిత్తం కేజీహెచ్ కు తరలించారు. అతి వేగంగా వచ్చిన ఓ కారు రోడ్డు మద్యన ఉన్న డివైడర్ ను ఢీ కొట్టి.. అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. కారులో ముందు కూర్చున్న వ్యక్తులకు బెలూన్లు ఓపెన్ కావడంతో పెద్దగా ప్రమాదం జరగలేదు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం మీద వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు, కారులోని ఓ వ్యక్తి మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story