కూకట్‌పల్లిలో దుండగుల కాల్పుల్లో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు అలీ మృతి

కూకట్‌పల్లిలో దుండగుల కాల్పుల్లో గాయపడ్డ సెక్యూరిటీ గార్డు అలీ మృతి
హైదరాబాద్ కూకట్‌పల్లిలో దుండగుల కాల్పుల్లో గాయపడ్డ అలీ మృతి చెందాడు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు అలీ పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో పొందుతూ అలీ మరణించాడు

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దుండగుల కాల్పుల్లో గాయపడ్డ అలీ మృతి చెందాడు. కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు అలీ పొట్టలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆస్పత్రిలో పొందుతూ అలీ మరణించాడు. ఘటనా స్థలాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్, ఎస్‌వోటీ అడిషనల్ డీసీపీ సందీప్ పరిశీలించారు. దుండగుల కోసం నాలుగు ప్రత్యేక బృందాల ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా ఎస్‌వోటీ బృందాలతో గాలిస్తున్నారు. కూకట్‌పల్లిలోని HDFC బ్యాంకు ఏటీఎంలో డబ్బులు పెడుతుండగా... హఠాత్తుగా కొందరు ఆగంతకులు కాల్పులు జరిపారు. ఏటీఎంలో పెట్టాల్సిన నగదు ఎత్తుకెళ్లారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెక్యూరిటీ గార్డు అలీ మరణించాడు.

Tags

Read MoreRead Less
Next Story