Telangana: రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
By - Subba Reddy |5 Jun 2023 5:30 AM GMT
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటుచేసుకుంది. రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతుల్లో ఒకర్ని బ్రహ్మణపల్లికి చెందిన యాదగిరిగా గుర్తించారు. మరో యువకుడి మృతదేహం గుర్తుపట్టనంతగా ఉంది. రైల్వే పోలీసుల సమాచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక ఆత్మహత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులకు విషయంతో తెలియడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com