Uttar Pradesh : బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

Uttar Pradesh : బాలికపై అత్యాచారం.. నిందితుడు అరెస్ట్

రెండేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ అజీమ్ నగర్ పోలీస్టేషన్ పరిదిలో నమోదైంది. విషయం తెలుసుకున్న వెంటనే బాలికను హాస్పిటల్ కు తరలించిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటన మంగళవారం రాత్రి జరుగగా నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిదిలో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్లు పోలీసు సూపరింటెండెంట్ అశోక్ కుమార్ శుక్లా తెలిపారు.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాలికను పోలీసులు హాస్పిటల్ కు తరలించారు. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో అక్కడి నుంచి ఆమెను మొరాదాబాద్ లోని హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు ఖేమ్ కరన్ సైనీ అని చెప్పారు. సైనీ అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్లినప్పుడు సైనీ పోలీసులపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. దీంతో సైనీ కాలిపై షూట్ చేసినట్లు చెప్పారు. నిందితున్ని అరెస్ట్ చేసి హాస్పిటల్ కు తరలించినట్లు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story