Visakha : వీడిన కానిస్టేబుల్ మర్డర్ మిస్టరీ ..!

Visakha : వీడిన కానిస్టేబుల్ మర్డర్ మిస్టరీ ..!

విశాఖలో వన్ టౌన్ కానిస్టేబుల్ రమేష్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. భార్య శివాని హత్య చేసి చంపినట్లు పోలీసులు గుర్తించారు.ప్రియుడి మోజులో పడి హతమార్చినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. రమేష్‌ను పథకం ప్రకారమే అతిగా మద్యం తాగించి ప్రియుడితో కలిసి శివాని హతమార్చింది.

మద్యం తాగి నిద్రలో ఉన్న రమేష్ మొఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేయడంతో మృతి చెందాడు. మద్యం సేవించిన తర్వాత భార్య గొప్పతనం చెప్పాలంటూ రమేష్ వీడియోని భార్య శివాని చిత్రీకరించింది. శివాని చిత్రీకరించిన వీడియోను పరిశీలించి సెల్ ఫోనును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌కు తాగించిన మద్యంలో విష పదార్థం ఏమైనా కలిపారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుకు సంబంధించి భార్య శివాని, ప్రియుడుతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story