సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య

సూసైడ్ నోట్ రాసి మహిళా ఎస్సై ఆత్మహత్య
ఉత్తరప్రదేశ్ లో మహిళా ఎస్సై బలవనర్మణానికి పాల్పడడం కలకలం రేపింది. బులంద్‌షహర్‌ జిల్లాలోని అనూప్‌షహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జూ పవార్‌(30) ఎస్సైగా విధులు నిర్వహిస్తుంది.

ఉత్తరప్రదేశ్ లో మహిళా ఎస్సై బలవనర్మణానికి పాల్పడడం కలకలం రేపింది. బులంద్‌షహర్‌ జిల్లాలోని అనూప్‌షహర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆర్జూ పవార్‌(30) ఎస్సైగా విధులు నిర్వహిస్తుంది. అయితే జనవరి 1 (శుక్రవారం) రాత్రి తానూ అద్దెకు ఉంటున్న ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోయింది. ఇది గమనించిన ఆ ఇంటి యజమాని.. వెంటనే స్థానికులకి సమాచారం అందించడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆర్జూ పవార్‌ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. అర్జూ ఆత్మహత్యకు సంబంధించిన సూసైడ్ నోట్ ఆ గదిలో లభ్యం అయింది. అందులో తన చావుకు తానే బాధ్యురాలినని, తన పనుల వల్లే తనకు ఈ గతి పట్టిందని ఆమే తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్టుగా బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పి సంతోష్ కుమార్ సింగ్ తెలిపారు. దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story