కోవిడ్ తీవ్రతను తగ్గించే 'coronaid'

ఏదో ఒక దేశాన్నో, ఒక రాష్ట్రాన్నో కాదు ఏకంగా ప్రపంచం మొత్తాన్ని ఏకకాలంలో ఏడిపించింది కరోనా మహమ్మారి.. మరో వార్త లేకుండా మీడియా మొత్తం కరోనాతో యుద్ధం చేసింది. కోవిడ్ సోకిన వ్యక్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, మాట్లాడినప్పుడు ఇతరులకు సోకుతుందని తెలిసి సామాజిక దూరాన్ని పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ మహమ్మారిని దరిచేరనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. కానీ రోజువారి వ్యవహారాల్లో నలుగురితో మాట్లాడక తప్పని పరిస్థితి.. దైనందిన జీవనంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక రూపంలో వైరస్ వచ్చేస్తుంది. శరీరంలోకి చేరిన వైరస్ ఉపరితిత్తుల్లో తిష్ట వేసి మనిషికి ఊపిరి ఆడనివ్వకుండా చేస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి .. కరెన్సీ నోట్లు, ఫోన్ స్క్రీన్లు, స్టెయిన్లెస్ స్టీలు వంటి వాటి ఉపరితలాలపై 28 రోజుల వరకు బతుకుతుందని, వీటి ద్వారా కూడా ఇతరులకు సోకే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన నేషనల్ సైన్స్ ఏజెన్సీ నిర్వహించిన అధ్యయనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. కలుషితమైన లోహాన్ని తాకటం ద్వారా కూడా వైరస్ వ్యాపిస్తుందని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ పేర్కొంది. కోవిడ్ వచ్చిన వ్యక్తులు కోలుకునేందుకు 'coronaid' అనే ఔషధం అందుబాటులో ఉంది. ఇది శరీరంలోని సైటోకైన్ లెవల్స్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తుల్లోని సిలియాను సంరక్షించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుందని, రక్తప్రసరణను మెరుగు పరుస్తుందని సంస్థ ప్రతినిధులు వివరించారు. coronaid ఔషధం.. ప్రాణాంతకమైన వైరస్లు, బ్యాక్టీరియాల గురించి పరిశోధన చేసే సంస్థ CCMB ఆమోద ముద్ర పొందింది. coronaidకి వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్గా NuZen సంస్థ వ్యవహరిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com