ఎండుమిర్చి ఎక్కువగా వాడేస్తున్నారా.. అయితే

ఎండుమిర్చి ఎక్కువగా వాడేస్తున్నారా.. అయితే
ప్రపంచవ్యాప్తంగా 5,70,000 మందికి పైగా ప్రజల ఆరోగ్యం, ఆహార రికార్డులను బృందం విశ్లేషించిన

కారం ఎక్కువ తింటే కడుపులో మంట వస్తుందని ఊరగాయ పచ్చడి ఊరిస్తున్నా తినాలన్న కోరికను బలవంతగా అణిచిపెట్టుకునే వారికి శుభవార్త. మంచిది అన్నారు కదా అని మరీ ఎక్కువ తినకండి.. అప్పుడప్పుడు తింటే ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు అమెరికన్ పరిశోధకులు. అకాల మరణం, క్యాన్సర్, హృదయ సంబంధ వ్యాధులతో సహా మరికొన్ని వ్యాధులు మిరపకాయలను తినే వారిలో పావువంతు తగ్గుతుంది అని ఒక అధ్యయనం కనుగొంది.

మిరపకాయలు, మిరియాలు విస్తృత ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని యుఎస్ పరిశోధకులు కనుగొన్నారు . వీటిలో కణితులు, మంటలను ఎదుర్కోవడంతో పాటు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రపంచవ్యాప్తంగా 5,70,000 మందికి పైగా ప్రజల ఆరోగ్యం, ఆహార రికార్డులను బృందం విశ్లేషించిన తరువాత 'చాలా గొప్ప' ఫలితాలు వచ్చాయి.

ఏది ఏమయినప్పటికీ మిరపకాయ మన శరీరానికి రక్షణను ఎలా ఇస్తుంది, వాటిని ఎంత తరచుగా తినాలి అనేదానిని నిర్ధారించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరమని పరిశోధకులు గుర్తించారు. 'మిరపకాయను క్రమం తప్పకుండా వినియోగించడం వల్ల వ్యాధుల యొక్క తీవ్రతను తగ్గించవచ్చని ఒహియోలోని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ పరిశోధకుడు కార్డియాలజిస్ట్ బో జు చెప్పారు.

తమ అధ్యయనంలో, చైనా, ఇరాన్, ఇటలీ, యుఎస్ డేటాను సేకరించారు.'మొత్తం ఆరోగ్యంలో ఆహార కారకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని డాక్టర్ జు తెలిపారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని, తద్వారా డయాబెటిస్ ఊబకాయం రెండింటి నుండి రక్షణ కల్పిస్తుందని బృందం అభిప్రాయపడింది.

అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మరియు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీకి చెందిన పోషకాహార నిపుణుడు పెన్నీ క్రిస్-ఈథర్టన్ మాట్లాడుతూ, 'ఈ ఫలితాలు నిజంగా చాలా గొప్పవని భావిస్తున్నట్లు చెప్పారు. ఎలుకలపై చేసిన ప్రయోగాలు, కొవ్వును కరిగించడం ద్వారా బరువు పెరగకుండా మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చేస్తుందని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story