వర్షాకాలంలో స్కిన్ ప్రాబ్లమ్స్‎.. చర్మానికి ఇవి మాత్రం అస్సలు వాడొద్దు

Monsoon Skin Problems
Skin Problems In Monsoon
Monsoon: వర్షాకాలంలో కొందరు చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడతారు. వర్షాలకు తడిస్తే చర్మంపై దురదలు వచ్చే అవకాశం ఉంది.

Monsoon: వర్షాకాలంలో కొందరు చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బందులు పడతారు. వర్షాలకు తడిస్తే చర్మంపై దురదలు వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో చర్మా్న్ని సంరక్షించుకునేందుకు తగిన జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో చర్మ సంరక్షణ ఎంతో ముఖ్యం. వర్షాలను నుంచి వచ్చే స్కిన్ ఎలర్జీ నుంచి మీ చర్మాన్ని, ముఖాన్ని రక్షించుకోవాలి. వర్షాకాలంలో కొన్నిరకాల క్రీములు చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తాయి. కానీ కొన్ని చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ చిన్న చిట్కాలు పాటించి మీ చర్మాన్ని రక్షించుకొండి.

- వర్షాకాలంలో నిమ్మకాయ ఎక్కువగా వాడకూడదు. ఎందుకంటే నిమ్మకాయలో ఎక్కువ ఆమ్లం ఉంటుంది. ఇది చర్మం మీద దద్దుర్లు కలిగించే అవకాశం ఉంటుంది. పొడిచర్మం ఉన్నవారు నిమ్మకాయను అసలు వాడకూడదు

- బియ్యం పిండిలో చర్మాన్ని బిగించే లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఫేస్ మాస్కులలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. పొడి చర్మం ఉన్నవారు అసలు బియ్యంపిండి వాడకూడదు. ఎందుకంటే బియ్యం పిండి చర్మంలో తేమను తగ్గిస్తుంది. దాంతో ముడతలు వస్తాయి.

-ఉదయం, సాయంత్రం చన్నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే ముఖంపై పేరుకుపోయిన జిడ్డు తొలగిపోతుంది.

-దుమ్ము, క్రిములు, కాలుష్యానికి ఎక్కువగా ఎక్స్ పోజ్ అవ్వాల్సి వస్తుంది. ఇవి మీ చర్మానికి చాలా హానికరం. ముఖాన్ని కచ్చితంగా రెండుసార్లు శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మీ ముఖంపై దుమ్ము శుభ్రంగా తొలిగిపోతుంది.

- వర్షాకాలంలో ఎక్కువ మేకప్ వేసుకోకుడదు. కానీ వాటర్ ప్రూఫ్ మేకప్‌లు వాడితే.. చర్మానికి ఎలాంటి నష్టం ఉండదు.

-వర్షాకాలంలో ఆల్కహాల్ ఫ్రీ టోనర్ ఉపయోగించడం చాలా అవసరం. ముఖ్యంగా పొడి చర్మం ఉన్నవాళ్లు.. ఇంకా డ్రై కాకుండా ఉండాలంటే.. టోనర్ కంపల్సరీ వాడాలి. ఒకవేళ ఆయిల్ స్కిన్ ఉంటే.. యాస్ట్రిజెంట్ ఉపయోగించడం మంచిది.

-వానాకాలంలో నీటి కాలుష్యమయ్యే అవకాశాలు ఎక్కువ. కాచి చల్లార్చిన నీటిని తాగడం శ్రేయస్కరం.

- వాతావరణం చల్లగా, చీకటిగా ఉన్నప్పుడు చాలామంది సన్ స్క్రీన్ లోషన్ వాడకుండా ఉంటారు. ఇది చాలా పొరపాటు. ఎందుకంటే కొన్ని సెకన్ల పాటు సూర్య కిరణాలు పడినా.. చర్మానికి చాలా హానికరం. కాబట్టి బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా.. కొంచెం సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయాలి.

-వర్షాకాలంలో చాలామంది నీళ్లు సరిగా తాగరు. కానీ.. వర్షాకాలంలో అయినా సరే నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల హైడ్రేట్‌గా ఉంటారు. దీనివల్ల చర్మం ఫ్రెష్‌గా, అందంగా కనిపిస్తుంది.

- మాయిశ్చరైజర్‌ను రెగ్యులర్‌గా అప్లై చేస్తూ ఉంటే.. చర్మం పొడిబారకుండా ఉంటుంది. చర్మాన్ని రోజంతా మాయిశ్చరైజింగ్‌గా ఉంచడం చాలా అవసరం.

- డెడ్ స్కిన్ సెల్స్ నివారించడానికి చర్మాన్ని ఎక్స్ ఫోలియేట్ చేయడం చాలా అవసరం.

-వారానికి ఒకసారి కంపల్సరీ హోంమేడ్ స్క్రబ్ ఉపయోగించి డెడ్ స్కిన్ సెల్స్ తొలగించుకోవడం వల్ల.. చర్మం నిగారిస్తుంది.

- బయటి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాళ్లను గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి

- శనగపిండి చర్మ సంరక్షణలో చాలా ఉపయోగపడుతుంది. వానా కాలంలో జిడ్డు చర్మం ఉన్నవారికి హైడ్రేట్‌గా పనిచేస్తుంది. శనగపిండిలో పాలు లేదా పెరుగు కలిపి చర్మానికి రాస్తే చర్మంలో తేమ పెరుగుతుంది.

-రెండు చెంచాల కొబ్బరిపాలలో కొన్ని అరటి పండు ముక్కలు వేసి పేస్టుగా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా పూయాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేయాలి. దీంతో చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది

-కాసిన్ని పాలలో రెండు కుంకుమ పూరేకలను వేసి కలపాలి. ఇలా చేసిన పదార్థాన్ని ముఖానికి రాసుకోవాలి. కాసేపటి తర్వాత ముఖాన్ని కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది

-అవకాడో పండు, అరటి పండును ముక్కలు ముక్కలుగా కోసి మెత్తగా పేస్టు చేయాలి. ఇందులో తేనె వేసి కలపాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి 45 నిమిషాల తర్వాత తీసివేస్తే చర్మం ప్రకాశిస్తుంది.


గమనిక : ఇవి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించిన వివరాలు. పూర్తి సమాచారం కావాలన్నా, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా.. ఆరోగ్య నిపుణులు సంప్రదించండి.

Tags

Read MoreRead Less
Next Story