ఉత్తర భారతాన్ని కప్పేస్తున్న మంచు

ఉత్తర భారతాన్ని కప్పేస్తున్న మంచు
విపరీతమైన హిమపాతం కారణంగా జమ్ము- కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో పరిస్థితి మరింత దారుణం

ఉత్తర భారతాన్ని మంచు కప్పేస్తోంది. విపరీతమైన హిమపాతం కారణంగా జనజీవనం స్తంభించింది. జమ్ము- కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో పరిస్థితి మరింత దారుణంగా మారింది. మంచు కారణంగా జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేయవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హిమాచల్‌లోని కీలాంగ్ ప్రాంతంలో అత్యల్పంగా మైనస్ 4.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ఇక మంచు తీవ్రత కారణంగా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story